విధాత : చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్పై మాజీ మంత్రి టి.హరీశ్రావు ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన హరీశ్రావు గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని ఆరోపించారు. విచారణ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు హాజరుకాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి అభాండాలు వేశారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే పవర్ కమిషన్ నుంచి జస్టిస్ నర్సింహా రెడ్డి స్వచ్ఛదంగా వైదొలగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు కేసీఆర్ సైతం పవర్ కమిషన్ నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేయగా, హరీశ్రావు ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలకు మద్ధతుగా అదే డిమాండ్ను వినిపించారు. విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి సైతం కేసీఆర్ డిమాండ్తో ఇప్పటికే ఏకీభవించడం జరిగింది.
కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలగాలి … మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్
చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్పై మాజీ మంత్రి టి.హరీశ్రావు ఫైర్ అయ్యారు

Latest News
'గబ్బర్సింగ్' సీసాలో 'భగత్సింగ్' సారా.. అభిమానులకు కిక్కిచ్చే ‘ఉస్తాద్’
13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!
లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!
40 ఏళ్లుగా అదే పరిస్థితి… యువ నిరుద్యోగంపై కొత్త రిపోర్ట్ సంచలనం
సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
వావ్...పక్షుల చెట్టు చూశారా..!
కూల్ డ్రింక్స్ లారీ బోల్తా...10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?