విధాత, వరంగల్ ప్రతినిధి: కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అవినీతి ఆస్తికి పంచాయతీకి సంబంధించినవేనని కడియం ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండటం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానని అన్నారు . పదేళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆక్షేపించారు. వేల ఎకరాల భూములు, వేలకోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కడియం చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబ గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
Kadiyam Srihari : కవిత లిక్కర్ కేసు తర్వాతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా
కడియం శ్రీహరి ఆరోపణ: కల్వకుంట్ల కుటుంబం అవినీతి డబ్బులు పంచుకోవడంతో గొడవలు, కేసీఆర్ కుటుంబం వనరులను దోచింది.

Latest News
చెలరేగిన అభిషేక్ : కివీస్తో తొలి టి20లో భారత్ ఘనవిజయం
మేడారంలో మండ మెలిగే పండుగ సందడి... భారీగా భక్తులరాకతో తీవ్రరద్దీ
కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక నో జామ్స్.. జుమ్జుమ్మని దూసుకెళ్లడమే..
ఒక్క క్షణంలో రక్తస్రావానికి బ్రేక్! కొరియా శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ!
దావోస్ సదస్సులో ప్రేయసిని చూసి కన్నుగీటిన ట్రూడో.. కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్స్..
ట్రంప్పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్ కుక్కలు!! ఇంటర్నెట్ను ఊపేస్తున్న వీడియో
పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్గ్లాసెస్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..