Delhi liquor Scam |ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్.. 21వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్‌ ఎమ్మెల్సీ క‌విత జ్యుడీషియ‌ల్ రిమాడ్‌ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు రిమాండ్ పొడిగించిన‌ట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది

  • Publish Date - June 7, 2024 / 03:49 PM IST

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్‌ ఎమ్మెల్సీ క‌విత జ్యుడీషియ‌ల్ రిమాడ్‌ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు రిమాండ్ పొడిగించిన‌ట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో క‌విత పాత్ర‌పై సీబీఐ స‌ప్లిమెంట‌రీ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఈ ఛార్జీషీటుపై మ‌ధ్యాహ్నం 2 గంటల‌కు విచార‌ణ జ‌రిపిన కోర్టు ఆమెకు 21వ తేదీ వ‌ర‌కు రిమాండ్ పొడిగిస్తూ విచారణ ఆ రోజుకు వాయిదా వేశారు. అయితే కవిత తను జైల్లో చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు కావాలని కోరారు. కవితకు ఆ పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తాజాగా లిక్కర్ పాలసీ స్కామ్ ఈడీ కేసులోనూ కోర్టు కవితకు జూలై 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం గమనార్హం.

Latest News