విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) సిటీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లోని మేదిపట్నం(Mehdipatnam) వద్ధ ఆర్టీసీ సిటీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు అంతా వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. వారంతా ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే మంటల్లో బస్సు చాలవరకు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం మంటలను అర్పివేశారు. ఈ ఘటన ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులను సైతం భయాందోళనలకు గురి చేసింది. మంటల్లో బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలను అంతా సెల్ ఫోన్లలో వీడియో తీయడంతో నిమిషాల్లో అది వైరల్ గా మారింది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Medipathnam Bus Fire : ఆర్టీసీ బస్సుల్లో మంటలు..హైదరాబాద్ లో ఘటన!
హైదరాబాద్ మేదిపట్నం లో RTC సిటీ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, వీడియో వైరల్ అయ్యింది.

Latest News
లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!
అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్
కత్తిలాంటి చూపులతో కట్టిపడేస్తున్న శ్రుతి హాసన్
యువత కోసం కర్ణాటకలో జెన్ జీ పోస్టాఫీస్..
ప్రీ లాంచ్ పేరుతో రూ.300కోట్ల మోసం..నిందితుడి అరెస్టు
ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు.. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు
తెలంగాణలో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు