విధాత, హైదరాబాద్ : విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా సంఘాల కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట సాగింది. పీడీఎస్య, పీవైఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విద్యారంగం సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులతో అణిచివేత చర్యలకు దిగడం శోచనీయమన్నారు. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, జాబ్ క్యాలెండర్ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పీడీఎస్యూ..పీవైఎల్ అసెంబ్లీ ముట్టడి భగ్నం
విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు

Latest News
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు