విధాత, హైదరాబాద్ : విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా సంఘాల కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట సాగింది. పీడీఎస్య, పీవైఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విద్యారంగం సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులతో అణిచివేత చర్యలకు దిగడం శోచనీయమన్నారు. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, జాబ్ క్యాలెండర్ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పీడీఎస్యూ..పీవైఎల్ అసెంబ్లీ ముట్టడి భగ్నం
విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ, పీవైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు

Latest News
నన్ను గౌరవించే పార్టీకే వెళ్లా: జీవన్ రెడ్డి
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
డీలిమిటేషన్ పై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : ఎంపీ చామల
ప్రేమ పేరుతో 180 మంది బాలికలకు లైంగిక వేధింపులు.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్
రీల్ లైఫ్ ‘శౌర్య’ రియల్ లైఫ్ టాపర్..
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు
దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదు : కేటీఆర్
హైదరాబాద్లో ఘోరం.. అన్నను చంపిన తమ్ముడు
అమరావతి అంశంపై మౌనం పాటిస్తున్న టాలీవుడ్ హీరోలు..
మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక..!