అలంపూర్,ఆగస్టు 09: రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు.అందులో భాగంగా శనివారం గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడులో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలు దేరి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.దీంతో సమీప పొలాల్లోని వర్షపు నీరు తోతట్టు ప్రాంతమైన గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా చేరుకుంది.దీంతో వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చేసేది ఏమి లేక ఆ మహిళ 20 మీటర్ల ఎత్తులో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి గోడ మీద అవస్థలు పడుతూ నడుచుకుంటూ రోడ్డు మార్గంకు చేరుకుంది.ఎన్ని అవస్థలు ఎదురైనా తమ్ముడికి రాఖీ కట్టానన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారీ వర్షం మొదలవ్వటంతో రాఖీ కట్టేందుకు అక్క అగచాట్లు!
రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి