అలంపూర్,ఆగస్టు 09: రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు.అందులో భాగంగా శనివారం గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడులో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలు దేరి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.దీంతో సమీప పొలాల్లోని వర్షపు నీరు తోతట్టు ప్రాంతమైన గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా చేరుకుంది.దీంతో వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చేసేది ఏమి లేక ఆ మహిళ 20 మీటర్ల ఎత్తులో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి గోడ మీద అవస్థలు పడుతూ నడుచుకుంటూ రోడ్డు మార్గంకు చేరుకుంది.ఎన్ని అవస్థలు ఎదురైనా తమ్ముడికి రాఖీ కట్టానన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారీ వర్షం మొదలవ్వటంతో రాఖీ కట్టేందుకు అక్క అగచాట్లు!
రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు

Latest News
విజయ్ - రష్మిక రిసెప్షన్ లో మెరిసిన తారాగణం ఫోటోలు
విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమ కథపై వచ్చిన క్లారిటీ..
సోషల్ మీడియాలో వేధింపులు, శరీరంపై విమర్శలు…
వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇలా.. జడ్పీటీసీగా తొలి ఓటమి..!
రేవంత్ మార్క్.. రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, సింఘ్వీ..!
హైదరాబాద్లో విరోష్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్…
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
ఇరాన్ యుద్ధనౌకను పేల్చేసిన అమెరికా.. శ్రీలంక సముద్రంలో ఘోర విషాదం, 87 మృతి!
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్: ఫిన్ అలెన్ మెరుపు సెంచరీ – ఫైనల్లో న్యూజీలాండ్
వంట విషయంలో అత్తతో గొడవ.. టెకీ కోడలు బలవన్మరణం