అలంపూర్,ఆగస్టు 09: రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు.అందులో భాగంగా శనివారం గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడులో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలు దేరి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.దీంతో సమీప పొలాల్లోని వర్షపు నీరు తోతట్టు ప్రాంతమైన గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా చేరుకుంది.దీంతో వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చేసేది ఏమి లేక ఆ మహిళ 20 మీటర్ల ఎత్తులో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి గోడ మీద అవస్థలు పడుతూ నడుచుకుంటూ రోడ్డు మార్గంకు చేరుకుంది.ఎన్ని అవస్థలు ఎదురైనా తమ్ముడికి రాఖీ కట్టానన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారీ వర్షం మొదలవ్వటంతో రాఖీ కట్టేందుకు అక్క అగచాట్లు!
రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు

Latest News
మేడారం ‘పునరుద్ధరణ’పై ఎందుకీ వివాదం!? సమగ్ర విశ్లేషణ!
వాయువేగంతో వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు
ప్రళయం 2026లోనా? బాబా వంగా పేరుతో వ్యాపిస్తున్న డూమ్స్డే ప్రచారంపై వాస్తవాలు.!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలకు త్వరలో పరిష్కారం.. : సంక్రాంతి వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన
మీరు పీల్చుతున్నది గాలి మాత్రమే కాదు.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!
నో వీఐపీ కోటా, నో ట్రావెల్ పాస్.. తొలి వందే భారత్ స్లీపర్ సాధారణ ప్రజల కోసమే..!
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..! పండుగ విశేషాలు తెలుసా..?
మన శంకరవరప్రసాద్ గారు హంగామా మధ్య విషాదం..
స్టేజ్ మీద ఎన్టీఆర్ సింగిల్ టేక్ డైలాగ్..