మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై సంధ్యా శ్రీధర్‌రావు ఫిర్యాదు

  • Publish Date - March 31, 2024 / 03:38 PM IST

విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్‌ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్‌రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు..ఎక్కడెక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు…అప్పటి అధికార పార్టీ నాయకులకు ఏ విధంగా ట్యాపింగ్ ద్వారా సహారించారు..ఎన్నికల్లో వారి గెలుపు కోసం డబ్బులను పోలీస్ వాహనాల్లో ఎక్కడెక్కడికి తరలించారన్న అంశాలపై మరిన్ని ప్రశ్నలు సంధించి వివారలు రాబట్టారు.

Latest News