విధాత : హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, ఆహార కల్తీకి పాల్పడి పేరు చెడగొడితే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని తెలిపారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తప్పకుండా నాణ్యత చర్యలు పాటించి తీరాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్ తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు వర్క్షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీల్లో ఆహార కల్తీ, నాసిరకం పదార్ధాలు వెలుగు చూసిన వైనంతో మంత్రి రాజనరసింహ చేసిన హెచ్చరికల పట్ల నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ బిర్యానీ పేరు చెడగొడితే కఠిన చర్యలు … మంత్రి దామోదరం రాజనరసింహ హెచ్చరిక
హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, ఆహార కల్తీకి పాల్పడి పేరు చెడగొడితే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ హెచ్చరించారు.

Latest News
రిపబ్లిక్ డేకి వాట్సప్ స్టిక్కర్లు వాట్సప్లోనే తయారుచేసుకోండి
మేడారం స్పెషల్ ... ఇప్పపువ్వు లడ్డు
గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్-బెంగళూరు హైవే – యాక్సెస్ కంట్రోల్డ్గా మార్పుతో 5 గంటల్లో బెంగళూరు
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!
మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం : కవిత
ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్ జట్టు ప్రకటన
ధరణి పోర్టల్ అక్రమాలు.. భూ భారతితో రట్టు: మంత్రి పొంగులేటి