విధాత, హైదరాబాద్ : అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనల్లో భాగంగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. తొలుత గన్ పార్కు వద్ద సమావేశమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ల చైర్మన్లు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెబీ నిబంధనలు ఉల్లంఘించిన సెబీ చీఫ్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్థలపైనా ఆరోపణలపై జేపీసీ విచారణకు ఆదేశించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CM REVANT REDDY | హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా.. సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రుల హాజరు
అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనల్లో భాగంగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు

Latest News
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు