Site icon vidhaatha

C.M REVANTH REDDY | రైతు సంక్షేమ కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం,పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ … రైతన్నకు రేవంతన్న మాట

విధాత, హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…రైతు సంక్షేమ కోణం ఉంటుందని ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా రైతు రుణమాఫీపై ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం “రైతు రుణమాఫీ పథకం” అని పేర్కోన్నారు. నాడు
మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా…నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా…ఎంత కష్టమైనా…ఎంత భారమైనా… ఏకకాలంలో రుణమాఫీ చేసిన…చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా…
మలి అడుగు విధివిధానాల ఖరారు అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ రైతు సంక్షేమం కోణం ఉంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version