విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభాకర్ రావు వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు, శ్రవణ్రావు ఎక్కడున్నారన్న సమాచారాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాజాగా నాంపల్లి కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, శ్రవణారావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా అతడి ఆచూకీ దొరకడం లేదు. దీంతో దర్యాప్తు అధికారులు విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Phone tapping case | ప్రభాకర్రావు అరెస్టుకు రంగం సిద్ధం .. దొరకని శ్రవణ్రావు ఆచూకీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Latest News
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బతికే ఉన్నారా? "మరణించివుండవచ్చని" నెతన్యాహూ సంచలన ప్రకటన
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: మధ్యప్రాచ్యంలో గగనతలాల మూసివేత
ఓరుగల్లు గడ్డపై నుండి 'రుద్రమ' విజయం... ఉత్సాహాన్ని నింపిన రాకెట్ ప్రయోగం
లైవ్ అప్డేట్స్: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు – బాలికల పాఠశాలలో 53 మంది మృతి
శ్రీముఖి ఏముంది మావా.. పొట్టి గౌన్ లో కిరాక్ ఫోజులు
స్థానికులకు ఉద్యోగమివ్వకుంటే ప్రారంభాన్ని అడ్డుకుంటాం : హరీష్ రావు
ప్రైవేట్ పార్టీలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.. వైరల్ అవుతోన్న పిక్స్
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..24మంది విద్యార్ధుల మృతి
తొలిసారిగా రంజీ ట్రోపీ విజేతగా జమ్మూ కశ్మీర్ చారిత్రాక విజయం
వీకెండ్లో ఓటీటీలో సందడే సందడి..