విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభాకర్ రావు వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు, శ్రవణ్రావు ఎక్కడున్నారన్న సమాచారాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాజాగా నాంపల్లి కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, శ్రవణారావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా అతడి ఆచూకీ దొరకడం లేదు. దీంతో దర్యాప్తు అధికారులు విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Phone tapping case | ప్రభాకర్రావు అరెస్టుకు రంగం సిద్ధం .. దొరకని శ్రవణ్రావు ఆచూకీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Latest News
ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ..
అక్షయ తృతీయ బంగారం సేల్స్ పెరిగేనా..?
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ జంట
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. రోజుకు 338 పదాలను తగ్గించేశాం.. ఆందోళన రేకెత్తిస్తున్న అధ్యయనం!
ప్రభుత్వ మీటింగ్ మధ్యలో అనుకోని అతిథి.. కలెక్టర్ కుర్చీలో కూర్చొని కోతి హంగామా!
రాశీ ఖన్నా కారవాన్లో చోరీ
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..
నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్కామ్ ద్వారా భర్తీ
ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!
సహజీవనంలో 'కోడిగుడ్డు' వివాదం.. ప్రియుడిని చంపిన సౌందర్య..!