లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జన జాతర పేరిట తుక్కుగూడలో శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగర శివార్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమవైపు తిరిగి ఆగాఖాన్ అకాడమీ, విజయా డెయిరీ, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్లా జంక్షన్, తిమ్మాపూర్, రాచులూరు నుంచి రాచులూరు గేటు మీదుగా వెళ్లాలి.
- శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగి మన్సాన్పల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్కు చేరుకోవాలి. శంషాబాద్ నుంచి హైదరాబాద్కు చేరుకోవాల్సి ఉంటుంది.
- తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను కిందకు దిగడానికి అనుమతించరు. పెద్ద అంబర్పేట నుంచి పెద్ద గోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు.