CM KCR | BRS
విధాత: నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్పీ, కలెక్టరేట్ను పూర్తి చేసి తన చేత ప్రారంభించుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 19వ కలెక్టరేట్ను ఇవాళ ప్రారంభించుకున్నాం. గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్ను కూడా త్వరలో ప్రారంభించుకో బోతున్నాం. ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రభాగానా ఉంది. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఇక్కడ ఉన్నారు. ఉద్వేగంతో చాలా గొప్పగా పాటలు రాస్తారు. సహజమైన కవి. వాగు ఎండిపాయేరా, పెద్ద వాగు ఎండిపాయేరా అని వెంకన్న పాటలు రాసారు. దుందుభి నది ఎలా కొట్టుకుపోయిందో వారు చెప్పారు.
Watch Live: BRS President, CM Sri KCR inaugurating the BRS Party Nagarkurnool district office. https://t.co/03KqXmvxtY
— BRS Party (@BRSparty) June 6, 2023
హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఆ వాగు మీద కట్టిన చెక్ డ్యామ్లు, నీటిని చూసి ఆనందించిపోయాం. నేను, జయశంకర్ సార్ కలిసి తిరుగుతుంటే.. పాలమూరు కరువు గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. సూర్యాపేట నుంచి కల్వకుర్తి ప్రాంతమంతా ఎడారిలా ఉండేది. అలాంటి కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మంచినీటి పథకంలో విజయం సాధించాం. అనేక అవార్డులు, రివార్డులు సాధించాం అని కేసీఆర్ తెలిపారు.
Live: CM Sri KCR inaugurating Nagarkurnool District Integrated Offices’ Complex. https://t.co/XC0Xu9IErL
— Telangana CMO (@TelanganaCMO) June 6, 2023
భారతదేశంలో ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ నెలవుగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విధంగా ఈ 9 ఏండ్లలో అనేక విజయాలు సాధించాం. కరోనా, నోట్ల రద్దు బాగా దెబ్బతీసింది. మొత్తంగా ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించినందుకు ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తున్నాను. అన్ని రంగాలు సమన్వయంతో కలిసి పని చేయడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది.
వలసలకు, కరువుకు నెలవైన జిల్లాలో అద్భుతమైన, బ్రహ్మాండమైన అద్భుతాలు జరుగుతున్నాయి. కన్నుల పండువగా పంటలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ పిలుపునిచ్చినా యజ్ఞంలా, ఒక ధర్మకార్యంలా మీ స్థాయిల్లో పని చేశారు. దేశంలోని ఏ పల్లెలు కూడా మన పల్లెలకు సాటిరావు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. ధర్మం తప్పకుండా జయిస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు.
అప్పుడే.. ఎంపీగా ఉండాలని నిర్ణయించుకున్నా: కేసీఆర్
తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్కర్నూల్ జిల్లా కాకపోయేది. ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలు వచ్చేది కాదు. అద్భుతంగా ఈ భవననాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ఉద్యమానికి చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటు తనం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సాగు, తాగునీటికి , కరెంట్కు ఇబ్బంది పడుతున్నారు.
ఇవన్నీ అర్థం కావాలంటే పాలమూరు ఎంపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జయశంకర్ సార్ సూచన మేరకు పాలమూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం బలంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆదరణతో ఎంపీగా గెలిపించారు. ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్పటికీ మరిచిపోను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేండ్లు గడిచిపోయాయి. ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుని, భారతదేశంలోనే అగ్రభాగానా ఉన్నాం. అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్. కరెంట్ వస్తదో రాదో తెలియని పరిస్థితి. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా మనమే నంబర్ వన్. సంక్షేమ రంగంలో కూడా రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందున్నాం అని కేసీఆర్ తెలిపారు.
Live: BRS President, CM Sri KCR addressing a Public Meeting in Nagarkurnool https://t.co/m9gwM1N3F2
— BRS Party (@BRSparty) June 6, 2023
అణగారిని దళిత జాతిని ఉద్దరించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళితబంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బస్సులకు ఆలవాలం పాలమూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంటని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో అవి మాయమయ్యాయి.
పంట కొనుగోలు కేంద్రాలు వచ్చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ఇది. కేసీఆర్ రాకముందు ఇక్కడ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పాలమూరును దత్తతను తీసుకున్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి.
నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహబూబ్నగర్, వనపర్తికి మంజూరు చేయగానే మీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి మెడికల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడికల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలోవ స్తాయనికలగన్నమా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.