విధాత:తిరుపతి,జూలై 3:టీటీడీలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. వీరిలో 81 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక అసిస్టెంట్, 20 మంది ఆఫీస్ సబార్డినెంట్స్, ఒక డ్రైవర్, ఏడుగురు ఎమ్పిడబ్లూ, నలుగురు హెల్పర్లు, ముగ్గురు క్లీనర్లు, ఒక ఫారెస్టు మజ్దూర్ ఉన్నట్టు టిటిడి ఈవో డా.కె ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈఓ కారుణ్య నియామకపత్రాలు అందజేశారు.