విధాత: ఈనెల 30వతేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి,ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా తోపాటు ఇతర మార్గాల్లోను ప్రచారం చేయడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 126(1)(బి) ప్రకారం పోలింగ్ సమయం ముగిసే 72గం.ల ముందు ఎన్నికల ప్రచారానికి సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సినిమాటోగ్రఫీ,టెలివిజన్ చానళ్ళు లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా గాని ఎలాంటి ప్రచారాలు నిర్వహించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా పోలింగ్ ముగిసేందుకు 72గం.ల ముందు అనగా ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన వివరాలను గాని ఎలక్ట్రానికి మీడియా చానళ్ళ ద్వారా ప్రచారం చేయడం లేదా వెల్లడించాన్నినిషేధించడం జరిగిందని సిఇఓ విజయానంద్ స్పష్టం చేశారు.కావున ఈవిషయమై రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ వారిని అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు.
బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి
<p>విధాత: ఈనెల 30వతేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి,ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ […]</p>
Latest News

వివాదం వల్ల వరదలా సబ్స్క్రైబర్లు..
రూ.15 వేలలోనే ఊటీ ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ!
మీ కుక్కర్ విజిల్ రావట్లేదా.. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరే చిటికెలో బాగుచేసుకోవచ్చు!
ఎన్సీఎల్లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు..!
అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!