Site icon vidhaatha

అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం

విధాత‌: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమ‌న్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయ‌న పేర్కొన్నారు.

Exit mobile version