అమరావతి : శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. భక్తుల రద్దీ కారణంగా క్యూలెన్లలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇప్పటికే 9మంది మృతి చెందారు. పలువురు భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. కార్తీక మాసం, ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు వేల సంఖ్యలో కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర దేవాలయం సందర్శనకు తరలివచ్చారు.
క్యూలైన్లలో రద్దీ నేపథ్యంలో తొక్కిసలాట నెలకొందని..భక్తులలో ఎక్కుగా మహిళలు చనిపోయినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పోలీసులు, అధికార యంత్రాంగం గాయపడిన వారికి ఆసుపత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
