Site icon vidhaatha

ఈ-గెజిట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version