Site icon vidhaatha

Gold Rates | దీపావళికి ముందు కొనుగోలుదారులకు షాక్‌.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

Gold Rates | దీపావళికి ముందు కొనుగోలుదారులకు పసిడి ధరలు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. తాజాగా బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.650 పెరిగి.. తులం ధర రూ.74,400కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.710 పెరిగి.. తులానికి రూ.81,160కి పెరిగి సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. మరో వైపు వెండి ధర సైతం భారీగానే పైకి కదిలింది. ఒకే రోజు ఏకంగా కిలోకు రూ.1000 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.74,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.81,160కి ఎగిసింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.74,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.81,310కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.81,160కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.74,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.81,160 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. కిలో రూ.వెయ్యి తగ్గి ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.లక్షలకు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.2వేలకుపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1.9లక్షలు పలుకుతున్నది. వాస్తవానికి బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ వస్తుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధరలో తేడాలుంటాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపై ధర ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి. అలాగే, వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలు సైతం ధరలపై ప్రభావం పడుతుంటుంది.

Exit mobile version