విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్లైన్లో ప్రచురించారు. వెంటనే డిలీట్ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. ‘ప్రింట్నైట్మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసే ముప్పుందని తెలిపింది.
కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోండి.. మైక్రోసాఫ్ట్
<p>విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ […]</p>
Latest News

పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు