విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్లైన్లో ప్రచురించారు. వెంటనే డిలీట్ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. ‘ప్రింట్నైట్మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసే ముప్పుందని తెలిపింది.
కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోండి.. మైక్రోసాఫ్ట్
<p>విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ […]</p>
Latest News

వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా పడ్డ ‘టాక్సిక్’..
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
విరోష్ జంట ప్రత్యేక విందు ..
కింద చేపల చెరువు.. పైన సొరకాయల సాగు.. ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం
ఇండస్ట్రీలో మొదలైన కొత్త ఉద్యమం...
ఓయూ, కేయూలో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ..! ఏప్రిల్లో నోటిఫికేషన్..!!
మార్చి తొలి వారం ఓటీటీ సంబరం ..
ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ నియామకం