విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.12000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై థానే క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ డ్రగ్స్ ఫ్యాక్టరీలో సోదాలు చేపట్టి.. డ్రగ్స్ తయారు చేస్తున్న 13మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టీసీ, మోలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 32,000 లీటర్ల రా మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్కు చెందిన మహిళను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. డ్రగ్ ఫ్యాక్టరీ సీజ్
