విధాత, హైదరాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృతి చెందినట్లుగా, మరో 11మంది గాయపడినట్లుగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి.
పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు.. 14మంది దుర్మరణం
పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృ

Latest News
దేశంలోనే తొలి E100 కారును తీసుకొచ్చిన మారుతి.. పెట్రోల్ బాధలు తప్పినట్లేనా?
ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్.. ధర, ఫీచర్లు లీక్!
హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?
ఆకాశంలో యాక్సిడెంట్.. విమానం ఢీకొట్టడంతో గాల్లోనే ప్రాణాల కోసం పోరాడిన పారా గ్లైడర్.. వీడియో వైరల్!
వరంగల్ అభివృద్ధిపై చిగురించిన ఆశలు!
మెట్రో కు రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్సీ తో తెలంగాణ రుణ ఒప్పందం
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని తొలి శిల్పం గుర్తింపు
బోరుబావికి ‘అంత్యక్రియలు’..వైరల్ వీడియో
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ జాతర..
మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం