విధాత, హైదరాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృతి చెందినట్లుగా, మరో 11మంది గాయపడినట్లుగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి.
పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు.. 14మంది దుర్మరణం
పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృ

Latest News
పేరు ‘స్టేషన్’ రూటు మాత్రం సపరేటు
19 ఏళ్ల తర్వాత భారత్లో ప్రదర్శనలివ్వనున్న పాప్ సంచలనం షకీరా
ఎప్స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్... గేట్స్కు ఏంటీ దుస్ధితి?.. న్యూఢిల్లీలో ఉండీ సమ్మిట్కు దూరం
మంత్రి పొంగులేటి చుట్టూ అక్రెడిటేషన్ వివాదం...
సుంకాల పెంపు రద్దు.. ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ !
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో... పెట్టుబడిదారీ సమాజాన్ని ఇప్పటికీ భయపెడుతున్న ‘పిశాచం’
పెంపుడు కుక్కను కొట్టారని.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
50 దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన చైనా.. లిస్ట్లో భారత్ ఉందా..?
రేపట్నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన
గ్లోబల్ ఏఐ సమ్మిట్లో గాల్గోటియ యూనివర్సిటీ ఘటన భారత ప్రతిష్ఠకు మచ్చ