విధాత, హైదరాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృతి చెందినట్లుగా, మరో 11మంది గాయపడినట్లుగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి.
పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు.. 14మంది దుర్మరణం
పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృ

Latest News
పాకిస్థాన్కు అంత సీన్ లేదు : ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్య
బీఎండబ్ల్యూ నుంచి కొత్ బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మైండ్ బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో ఒప్పో ఫ్లాగ్షిప్.. ఫొటోగ్రఫీ లవర్స్కి ఇక పండగే..!
పొద్దున్నే పెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ.. గొప్పగా చెప్పుకున్న బాస్ను ఏకిపారేసిన నెటిజన్లు
ములుగు జిల్లాలో "మన ఇసుక వాహనం".. అక్రమ రవాణాపై ఉక్కు పాదం.. పంపిణీలో పారదర్శకత
తెలంగాణలో డిజిటల్ జనగణనకు శ్రీకారం.. మే 11 నుంచి తొలి దశ
వరంగల్ కేఏంసీలో ర్యాగింగ్ కలకలం.. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
ఆంటీ అని పిలిచినందుకు కోర్టుకెక్కిన మహిళ.. రూ.1.8 లక్షల ఫైన్ విధిస్తూ తీర్పు
సినిమా కాదు..నీళ్లలో జరజర పాకుతూ గ్రీన్ అనకొండ హల్చల్ !
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్