విధాత, హైదరాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృతి చెందినట్లుగా, మరో 11మంది గాయపడినట్లుగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి.
పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు.. 14మంది దుర్మరణం
పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృ

Latest News
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
గుంటూరులో చదువలే..గూడు పుఠాణి తెలియదు : సీఎం రేవంత్ రెడ్డి
నా ప్రెస్ సెక్రటరీ మస్తు బ్యూటీఫుల్: డోనాల్డ్ ట్రంప్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ NTR
వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా 'ఆదర్శ కుటుంబం'
పెళ్లి లోపే మహిళలు అనుభవిస్తున్నారు.. జనవరి 1న స్వామి వ్యాఖ్యలపై విచారణ