Pulasa Fish
విధాత: గోదావరిలో అరుదుగా లభించే పులస చేపకు ఏకంగా 15వేల ధర పలికింది. యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకార్మికులకు రెండు కేజీల బరువున్న పులస చేప చిక్కింది. దానిని మార్కెట్ లో 15వేలకు విక్రయించారు.
పులసల కోసం కాకినాడ, రాజమహేంద్రవరం, హైద్రాబాద్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారని, గోదావరికి వరద నీరు వస్తుండటంతో పులసలు దొరుకుతున్నాయని మత్స్యకార్మికులు తెలిపారు