విధాత: జాతీయ జీవ వైవిధ్య బోర్డు ఛైర్మన్గా అచలేందర్రెడ్డి నియమితులయ్యారు. ఆయన జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్కు చెందిన విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి. అచలేందర్ను ఎన్బీఏ ఛైర్పర్సన్గా క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించింది.
చైన్నైలోని ఎన్బీఏ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అరుణాచల్ప్రదేశ్ పీసీసీఎఫ్గా పనిచేశారు. ఎన్బీఏ కార్యదర్శిగా ఉన్నప్పుడు కాప్ సదస్సు నిర్వహణలో అచలేందర్ కీలకపాత్ర పోషించారు. బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటునకు కాన్సెప్ట్ నోట్ సిద్ధం చేశారు.