విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్లోని న్యూజ్ రివర్ గ్రీన్వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Latest News
కరీంనగర్ లో తుపాకీ కాల్పుల కలకలం
మీర్పేట్లో భయానక హిట్ అండ్ రన్..
బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి..
ముంబై ట్రాఫిక్ వివాదంపై వైరల్ వీడియో: మహిళ వివరణ
తెలంగాణ సర్వ నాశనానికే కవిత పార్టీ
కవిత మాటలపై ట్రోలింగ్.. వెంటాడుతున్న బీఆర్ఎస్ మాటలు!
నిలకడగా బంగారం, వెండి ధరలు
ఢిల్లీలో ఎగిసిపడ్డ అగ్నికీలలు.. 9 మంది సజీవదహనం
హైదరాబాద్లో ఫ్రీ సమ్మర్ క్యాంపు.. సంగీతం, పెయింటింగ్పై శిక్షణ
విదేశాల్లో ఒంటరి జీవితం అంత ఈజీ కాదు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అనుభవం వైరల్