Site icon vidhaatha

135 రోజులు.. మూడం­చెల కాల్పుల విర­మణ


గాజా : ఇజ్ర­యెల్‌ దళా­లతో యుద్ధాన్ని ముగిం­చేం­దుకు హమాస్‌ మూడం­చెల కాల్పుల విర­మ­ణను ప్రతి­పా­దిం­చింది. 135 రోజుల పాటు.. ఉండే ఈ ప్రతి­పా­ద­నలో అక్టో­బర్‌ 7న హమాస్‌ మిలి­టెంట్లు బందీ­లుగా తీసు­కున్న ఇజ్రా­యెల్‌ పౌరు­లను పాల­స్తీనా ఖైదీ­లతో మార్పిడి, తది­తర అంశాలు ఉన్నాయి. అమె­రికా, ఇజ్రా­యెల్‌ మద్ద­తుతో ఖతార్‌, ఈజిప్ట్‌ దేశాల మధ్య­వ­ర్తుల బృందం గత­వారం పంపిన ప్రతి­పా­ద­నకు స్పంద­నగా నాలు­గు­న్నర నెల­ల­పాటు కాల్పుల విర­మ­ణకు సిద్ధ­మని వెల్ల­డిం­చింది.


ఈ కాలంలో గాజా పున­ర్ని­ర్మాణం ప్రారం­భిం­చడం, గాజా నుంచి ఇజ్రా­యెల్‌ దళాలు పూర్తిగా వైదొ­ల­గడం, మృత­దే­హాలు, ఇత­రత్రా పర­స్పర మార్పిడి వంటి అంశాలు కూడా హమాస్‌ ప్రతి­పా­ద­నలో ఉన్నాయి.

ఇజ్రా­యెల్‌, హమాస్‌ మధ్య యుద్ధాన్ని నివా­రిం­చేం­దుకు అత్యంత కీలక దౌత్య­ప­ర­మైన చొర­వలో భాగంగా అమె­రికా విదే­శాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఖతార్, ఈజిప్ట్‌ మధ్య­వ­ర్తు­లతో మాట్లాడి ఇజ్రా­యెల్ చేరు­కు­న్నారు.


హమాస్‌ ప్రతి­పా­ద­నల ప్రకారం.. వారి వద్ద బందీ­లుగా ఉన్న మహి­ళలు, 19 ఏళ్ల­లోపు పురు­షులు, వృద్ధులు, అనా­రో­గ్యంతో ఉన్న­వా­రిని తొలి 45 రోజుల్లో విడు­దల చేస్తారు. ఇందుకు ప్రతిగా ఇజ్రా­యెల్‌ జైళ్లలో ఉన్న పాల­స్తీనా మహి­ళలు, చిన్న పిల్ల­లను ఆ దేశం అప్ప­గిం­చాల్సి ఉంటుంది. మిగి­లిన పురు­షు­లను రెండో దశలో విడు­దల చేస్తారు. మూడో దశలో మృత­దే­హా­లను, ఇత­రా­లను పర­స్పరం మార్పడి చేసు­కో­వాల్సి ఉంటుంది.


మూడో దశ ముగిసే నాటికి యుద్ధా­నికి ముగింపు పలి­కేలా ఇరు­ప­క్షాలు ఒక ఒప్పం­దా­నికి రావా­లని హమాస్‌ ప్రతి­పా­దిం­చింది. అయితే.. ఇజ్రా­యెల్‌ జైల్లో ఉన్న 1500 మంది పాల­స్తీనా ఖైదీ­లను విడు­దల చేయా­లని, అందులో ఇజ్రా­యెల్‌ జీవిత ఖైదు విధిం­చిన వారిని తాము ఎంపిక చేసు­కుం­టా­మని షరతు పెట్టింది. కాల్పుల విర­మణ సమ­యంలో ఆహారం, ఇతర సహా­యాలు గాజా­లోకి పంప­డాన్ని పెంచాల్సి ఉంటుంది.


2023 అక్టో­బర్‌ ఏడవ తేదీన ఇజ్రా­యె­ల్‌పై ఆక­స్మిక దాడులు చేసిన హమాస్‌.. 1200 మందిని చంపి, 253 మందిని బందీ­లుగా పట్ట­కు­న్నది. దీనికి ప్రతిగా ఇజ్రా­యెల్‌ దళాలు గాజాపై జరి­పిన దాడిలో 27,585 మంది చని­పో­యా­రని గాజా ఆరోగ్య శాఖ పేర్కొం­టు­న్నది. శిథి­లాల కింద వేల సంఖ్యలో సమాధి అయి ఉంటా­రని అంచనా వేసింది.

Exit mobile version