హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి 12:15 గంటలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైళ్లు 12:15 గంటలకు బయల్దేరి, రాత్రి ఒంటి గంట సమయానికి గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఎండీ పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం సేవించి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
న్యూఇయర్ వేడుకలు.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు
Latest News

కోటీశ్వరుడిగా మారిన 3 రూపాయాల వ్యవసాయ కూలీ.. ఇది ఓ కశ్మీరీ రైతు విజయగాథ..!
లెక్చరర్తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్..
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి