IND vs WI 1St Test | వెస్టిండీస్తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా శుభారంభం చేసింది. వెస్టిండీస్పై భారత్ టెస్టు చరిత్రలో 23వ విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా (32), ఇంగ్లండ్ (31)పై మాత్రమే ఎక్కువ టెస్టులను గెలించింది. మరో 22 మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకపై విక్టరీ సాధించింది. తొలి ఇన్నింగ్లో వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.. ఇన్నింగ్స్ 141 పరుగుల ఘన విజయాన్ని అందుకున్నది. ఈ విజయంతో రోహిత్ శర్మ సేన సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. జులై 20 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్లో రెండో మ్యాచ్ ట్రినిడాడ్లో జరగనుంది. ఇన్నింగ్స్ తేడాతో ఆసియా వెలుపల భారత్కు అతిపెద్ద విజయం.
సెంచరీలతో కదం తొక్కిన జైస్వాల్, రోహిత్
భారత్ తరఫున జైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు లభించింది. అలాగే బౌలింగ్లోనూ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల తీయగా.. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులు సాధించిన జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
వెస్టిండిస్ వెన్నువిరిచిన అశ్విన్
మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్లో కలిపి 12 వికెట్లు పడగొట్టాడు. అతను భారత్ తరఫున ఎనిమిదోసారి ఒక మ్యాచ్లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన అశ్విన్.. అనిల్కుబ్లే రికార్డును సమం చేశాడు. హర్భజన్ సింగ్ ఒక మ్యాచ్లో ఐదుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా వెస్టిండీస్పై ఆరోసారి ఇన్నింగ్స్లో అశ్విన్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టుల్లో హర్భజన్ సింగ్ ఒక ఇన్నింగ్స్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్లో వెస్టిండిస్ వికెట్లు టపటపా..
రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. అలిక్ అథనాజ్అత్యధికంగా 28 పరుగులు చేశాడు. జాసన్ హోల్డర్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. జోమెల్ వారికన్ 18 పరుగుల వద్ద ఔట్ కాగా, అల్జారీ జోసెఫ్ 13, జాషువా డి సిల్వా 13 పరుగులు చేశారు. రామన్ రైఫర్ 11 పరుగులు చేశాడు. క్రెయిగ్ బ్రాత్వైట్, తేజ్నరైన్ చందర్పాల్ చెరో ఏడు పరుగులు చేసి ఔటయ్యారు. జెర్మైన్ బ్లాక్వుడ్ ఐదు పరుగులు చేయగా, రహ్కీమ్ కార్న్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. కెమర్ రోచ్ తన ఖాతాను తెరవలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్కు ఏడు వికెట్లు, రవింద్ర జడేజాకు రెండు, మహ్మద్ సిరాజ్కు ఒక వికెట్ దక్కింది.
యశస్వితో పాటు రోహిత్, కోహ్లి జోరు..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టులో యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. యశస్వి 171 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ 104 పరుగులతో రాణించాడు. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 37, ఇషాన్ కిషన్ ఒక పరుగుతో నాటౌట్గా నిలిచారు. శుభమాన్ గిల్ సిక్స్, అజింక్య రహానే మూడు పరుగులు చేశారు. వెస్టిండీస్ తరఫున కెమర్ రోచ్, అల్జారీ జోసెఫ్, రహ్కీమ్ కార్న్వాల్, జోమెల్ వారికన్, అలిక్ అథనాజ్ ఒక్కో వికెట్ తీశారు.