విధాత: సింగరేణి కార్మికుడు, ప్రజా కవి జయరాజు పదవీ విరమణ కార్యక్రమం గురువారం హైదరాబాదులోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రమావత్ అంజయ్య నాయక్, న్యాయవాది ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.