Warangal
వరంగల్: వరంగల్ (Warangal) పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ (Modi) ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకున్నారు. అతడు ఆటిజం (Autism) తో బాధపడుతున్నప్పటికీ అద్భుతమైన గాత్రంతో అలరించే కామిశెట్టి వెంకట్.
ఈ యువకుడు నైపుణ్యానికి పవర్హౌస్ లాంటి వాడని మోదీ అభివర్ణించారు. వైకల్యం అతడిని ఆపలేకపోయిందని కొనియాడారు. వెంకట్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. అతడి పాటను, నృత్యాన్ని చూసి వెన్నుతట్టారు.
The phenomenal Kamisetty Venkat is a powerhouse of talent and youthful energy. He did not let his autism deter him and went on to pursue singing. He sung and also danced to Naatu Naatu. I salute his fortitude. pic.twitter.com/QaRuFIvIyQ
— Narendra Modi (@narendramodi) July 8, 2023
కామిశెట్టి వెంకట్ ఒక పవర్హౌస్. యువశక్తి, నైపుణ్యం అతడిలో నరనరానా ఉన్నాయి. అద్భుతంగా పాడాలనే కోరికను ఆటిజం ఆపలేకపోయింది. నాటు నాటు పాట పాడటమే కాకుండా డ్యాన్స్ చేసి చూపించాడు. అతడికి నా సెల్యూట్ అని మోదీ ట్వీట్ చేశారు.
వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను శనివారం తెల్లవారుజామున మోదీ కలుసుకున్నారు. వరంగల్లో వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలుసుకున్నాను. వారి కథలు, వెతలు నన్ను కదిలించాయి. శాంతియుతమైన సమసమాజాన్ని నిర్మించేలా వారు మాకు స్ఫూర్తి నింపారు అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు.
అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు, యువశక్తికి ఒక పవర్హౌస్. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయింది, పాడటాన్ని కొనసాగించాడు. నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు నృత్యం కూడా చేశాడు. ఆయన మనోధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. pic.twitter.com/1UkqrTTwA9
— Narendra Modi (@narendramodi) July 8, 2023