Site icon vidhaatha

యాదాద్రి పవర్‌ ప్లాంటుతో వరికి ఉరే!

విధాత, హైద­రా­బాద్: తెలం­గాణ వెలుగు దివ్వెగా బీఆ­రెస్ ప్రభుత్వం అభి­వ­ర్ణిస్తూ కోల్‌­బెల్ట్‌ ఏరి­యాకు దూరంగా నల్ల­గొండ జిల్లా దామ­ర­చర్ల మండలం వీర్ల­పాలెం సమీ­పంలో చేప­ట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణం ఈ ప్రాంత ప్రజ­లకు మేలు­కంటే పర్యా­వ­ర­ణ­ప­రంగా కీడు ఎక్కు­వగా చేస్తుం­దని పర్యా­వ­ర­ణ­వే­త్తలు ఆందో­ళన వ్యక్తం చేస్తు­న్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా వెలు­వడే కర్బన ఉద్గా­రా­లతో కురిసే ఆమ్ల వర్షాలు ఆ ప్రాంతంలో పంట­లను నాశనం చేస్తా­యని, ప్రత్యే­కించి ఈ ప్రాంతంలో ఎక్కు­వగా పండించే వరి పంటకు ఉరి వేసి­నట్టే అవు­తుం­దని హెచ్చ­రి­స్తు­న్నారు. అంతే­కా­కుండా ఈ ప్రాంతంలో నివ­సించే మను­షుల ఆరో­గ్యాన్ని కూడా దెబ్బ తీస్తుం­దని, సంతా­నో­త్పత్తి సమ­స్యలు తలె­త్తు­తా­యని చెబు­తు­న్నారు.


కాలుష్య నియం­త్రణ టెక్నా­లజీ లోపం.. ప్రజ­లకు శాపం

థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్స్ ఏర్పా­టులో కాలు­ష్యాన్ని త‌గ్గిం­చా­ల‌ని 2017లో కేంద్రం ఆదే­శాలు జారీ చేసింది. సల్ఫర్ డై ఆక్సైడ్‌, నైట్రో­జన్ ఆక్సైడ్‌ మోతాదు తగ్గిం­చేం­దుకు రెండు యూనిట్ల ఎఫ్‌­జీ­డీలు నిర్మిం­చాలి. యాదాద్రి ఫ్లాంట్‌లో అవిరి బయ­టకు పంపించే పొగ గొట్టం దగ్గర మండించే వాయు­వులు బయ­టకు పంపిం­చేం­దుకు 275 మీటర్ల ఎత్త­యిన పొగ గొట్టాలు కట్టారు. వాయు­వు­లను శుద్ధి చేసే యూని­ట్లకు కేంద్రం పేర్కొన్న టెక్నా­లజీ లేక­పో­వ­డంతో గొట్టాల ద్వారా నేరుగా అవిరి గాలిలో కలిసే ప్రమాదం నెల­కొంది. దీని వ‌ల్ల ప్లాంటు పరి­స­రాల గ్రామా­ల­పైన, అడ­వు­ల­పైన ఆమ్ల వ‌ర్షాలు కురిసే ప్రమా­ద­ముం­దని పర్యా­వ­ర­ణ­వే­త్త బాబూరావు హెచ్చరించారు. సదరు ఆమ్ల వర్షా­లతో ఆ ప్లాంట్ భాగాలు సైతం తుప్పు ప‌ట్టే అవ‌­కాశం ఉందని చెప్పారు. అలాగే సల్ఫర్ ఆక్సైడ్‌, నైట్రో­జ‌న్ ఆక్సైడ్ విడు­ద‌­ల‌తో వాయు­కా­లుష్యం, జల­కా­లుష్యం, భూ క్షీణత ఏర్పడి వన్య­ప్రా­ణు­లకు, పంట‌­ల‌కు, మ‌ను­షు­ల‌కు ప్ర‌మా­ద‌­క‌­రంగా పరి­ణ­మి­స్తుం­దని హెచ్చ­రించారు.


20న మూడో విడుత ప్రజా­భి­ప్రాయ సేక­రణ

సూపర్ క్రిటి­కల్ అల్ట్రా టెక్నా­ల­జీతో రూ.29,965 కోట్ల వ్యయంతో చేప­ట్టిన 4 వేల మెగా­వాట్ల యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌పై తిరిగి ప్రజా­భి­ప్రాయ సేక­రణ చేప­ట్టా­లని కేంద్ర ప్రభుత్వం నిర్ణ­యిం­చిన సంగ‌తి తెలి­సిందే. ఈ మేర‌కు ఫిబ్ర­వరి 20న ఉదయం 11 గంట­లకు ప్రజా­భి­ప్రాయ సేక­రణ చేప­ట్ట­ను­న్నట్టు పర్యా­వ­రణ, కాలుష్య నియం­త్రణ మండలి వెల్ల­డిం­చింది. అయితే.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబం­ధిం­చిన ముసా­యిదా ఎన్వి­రా­న్‌­మెం­టల్ ఇంపాక్ట్ అసె­స్‌­మెంట్ (ఈఐఏ) నివే­ది­కలో తీవ్ర లోపాల నేప­థ్యంలో ఈ నెల 20న జరిగే ప్రజా­భి­ప్రాయ సేక­రణ కీల­కంగా మారింది.


ఎన్‌­జీ­టీలో కేసు­లతో పర్యా­వ­రణ సమ­స్యలు బహి­ర్గతం

యాదాద్రి ప్లాంటుకు పర్యా­వ­రణ అను­మతి ఇవ్వడం తగ­దంటూ జాతీయ హరిత ట్రైబ్యు­నల్ (ఎన్జీటీ)లో వైజా­గ్​కు చెందిన సమ­త­తో­పాటు, ముంబైకి చెందిన కన్స­ర్వే­షన్ యాక్షన్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేసు వేశాయి. దీనిపై విచా­రణ జరి­పిన ఎన్​­జీటీ.. యాదాద్రి ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యా­వ­ర­ణంపై పడే ప్రభా­వంపై అధ్య­యనం కోసం వెంటనే టీవో­ఆర్​ జారీ చేయా­లని కేంద్ర పర్యా­వ­రణ శాఖను గత ఏడాది అక్టో­బ­ర్‌లో ఆదే­శిం­చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వ­ర్యంలో పర్యా­వ­రణ, అడ­వులు, వాతా­వ­రణ మార్పు మంత్రిత్వ శాఖలు మరో­సారి ప్రజా­భి­ప్రాయ సేక­ర­ణకు సిద్ధ­మ­య్యాయి. యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌కు 2,100 ఎక­రాల అట‌వీ భూముల్లో నిర్మిం­చారు. రాజీవ్ గాంధీ టైగ‌ర్ రిజ‌ర్వ్ జోన్ సమీ­పంలో, కృష్ణా నది చెంతన దీన్ని నిర్మిం­చారు.


అస‌లు అక్క‌డ ఎలా అను­మ‌తి ఇచ్చారు? పర్యా­వ­రణ సమ­స్య­లను పరి­గ­ణ­లోకి తీసు­కో­లే­దంటూ ఎన్జీటీ (నేష‌­న‌ల్ గ్రీన్ ట్రిబ్యు­న‌ల్‌)కి ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ నుంచి తీసు­కున్న భూము­లకు ప్రత్యా­మ్నా­యంగా ఇచ్చిన భూములు కూడా డిండి ఎత్తి­పో­త‌­ల‌లో భాగ‌­మైన ముంపు భూములు కావడం గమ­నార్హం. ఆ భూమి అడ­వు­లకు ప‌నికే రావన్న అంశం మరో సమ­స్యగా తయా­రైంది. అయితే.. మూడో­సారి జరిగే ప్రజా­భి­ప్రాయ సేక­ర­ణపై పలు అభ్యం­త­రాలు వ్యక్త­మ­వు­తు­న్నాయి. థర్మల్ ప్లాంట్‌ నిర్మా­ణంతో ఎదు­రయ్యే పర్యా­వ­రణ ప్రభా­విత నివే­ది­కను ప్రజలు చద­వ­కుండా కాలుష్య నియం­త్రణ మండలి తొలుత బహి­ర్గతం చేయ­లేదు. దీనిపై ప్రముఖ పర్యా­వ­రణ వేత్త బాబు­రావు ఫిర్యాదు చేయ­డంతో ప్రజా­భి­ప్రాయా సేక­ర­ణకు రెండు వారాల ముందు వెబ్‌­సై­ట్‌లో పెట్టారు.


అది కూడా 829 పేజీల ఆంగ్ల నివే­ది­కను మూడు భాగా­లుగా పెట్టారు. తెలు­గులో లేక­పో­వ­డంతో స్థానిక ప్రజ­లకు అది అర్థ­మయ్యే అవ­కాశం కూడా లేదని పర్యా­వ­రణ వేత్తలు చెబు­తు­న్నారు. ముందుగా ఆ నివే­ది­కను ప్రజల్లో చర్చకు పెట్ట­క­పో­వడం, గ్రామ­స­భల ద్వారా అవ­గా­హన కల్పిం­చ­క­పో­వడం వంటి­వేవీ లేకుం­డానే మరో­సారి ప్రజా­భి­ప్రాయ సేక­రణ తంతు ముగించి అను­మ­తుల కోసం అధి­కా­రులు ప్రయ­త్ని­స్తు­న్నా­రన్న అభి­ప్రా­యాలు వ్యక్త­మ­వు­తు­న్నాయి.


పర్యా­వ­రణ ప్రభా­వితా అంశా­లలో ప్రధా­నంగా బొగ్గు విద్యుత్ ప్లాంట్ నుండి గాలి­లోకి విడు­ద­లయ్యే అనేక వాయు కాలుష్య కార­కాలు ఉన్నాయి. వీటిలో సల్ఫర్ డయా­క్సైడ్(ఎస్‌వో), కార్బన్ మోనా­క్సైడ్ (సీవో), నైట్రో­జన్ ఆక్సైడ్లు (ఎన్‌­వో­ఎక్స్‌) , ఓజోన్ (వో) ఉన్నాయి. సస్పెండ్ పర్టి­క్యు­లేట్ మేటర్ (ఎస్‌­పీఎం), సీసం, నాన్‌మీథేన్‌ హైడ్రో­కా­ర్బ­న్‌ కూడా విడు­ద­ల­వు­తాయి. ఉష్ణో­గ్ర­తలు సైతం రెట్టింపవుతాయి. సల్ఫర్ డయా­క్సైడ్ (ఎస్‌వో) అనేది బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల నుండి వచ్చే ఒక సాధా­రణ కాలుష్యం. కొన్ని­సార్లు అధిక ఆక్సి­జన్ కార­ణంగా ఎస్‌వో కూడా ఏర్ప­డు­తుంది. ఇది వాతా­వ­ర­ణం­లోని తేమతో కలి­సి­పో­తుంది. ఆమ్లవర్షాన్ని కలి­గి­స్తుంది.


బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల నుండి వచ్చే ఎస్‌­పీఎం ప్రధా­నంగా మసి, పొగ, చిక్కటి ధూళి కణాలు.. ఆస్తమా, శ్వాస­కోశ, ఊపి­రి­తి­త్తుల వ్యాధు­లకు కారణమవుతాయి. చర్మ, కంటి దురద, గుండె జబ్బు­లనూ కల్గి­స్తాయి. అలాగే బొగ్గు పవర్ ప్లాంట్‌లో నీటిని బొగ్గును కడ­గ­డా­నికి ఉప­యో­గి­స్తారు. బాయి­లర్ ఫర్నే­స్‌లో తిరు­గుతూ ఆవి­రిని ఉత్పత్తి చేయ­డా­నికి పరి­క­రా­లను శీత­లీ­క­రిం­చ­డా­నికి ఉప­యో­గి­స్తారు. బొగ్గుతో శుద్ధి చేసిన నీటి దుమ్ము భూగర్భ జలా­లను కలు­షితం చేస్తుంది. వేడి నీటిని చల్ల­బ­ర­చ­కుండా జల వన­రు­ల­లోకి వది­లేస్తే, వాటి ఉష్ణో­గ్రత పెరు­గు­తుంది. తద్వారా జల, వృక్ష­జాలం, జంతు­జాలం ​​మీద ప్రభావం చూపు­తుం­దం­టు­న్నారు పర్యా­వ­రణ వేత్తలు. జీవ­రా­శుల్లో, పశు­వులు, మహిళల్లో సంతా­నో­త్పత్తి సమ­స్య­లను కూడా కల్గి­స్తా­యని గతం­లోని పరి­శో­ధన నివే­ది­కలు చాటు­తు­న్నాం­టు­న్నారు. మరో­వైపు బొగ్గు విద్యుత్తు ప్లాంట్‌ల నుండి శుద్ధి చేయని గాలి, నీటి కాలుష్య కార­కాలు నీటి వన­రు­లను, ప్రక్కనే ఉన్న ప్రాంతా­ల­లోని వృక్ష­జాలం, జంతు­జా­లంపై ప్రభావం చూపు­తా­యని, వాటిని జీవన లేదా జీవ­నో­పాధి కార్య­క­లా­పా­లకు అన­ర్హు­లుగా చేస్తా­యం­టు­న్నారు. అదీగాక బాయి­లర్లు, టర్బైన్లు, క్రషర్లు వంటి పరి­క­రాల విని­యోగంతో పవర్ ప్లాంట్ల నుండి వెలు­వడే అధిక శబ్ద స్థాయి­లు ప్లాంట్‌­లలో పని­చేసే వ్యక్తు­లపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

ప్రమా­ద­మని తెలి­సినా ప్లాంట్ల నిర్మా­ణాలు


థర్మల్ విద్యుత్తు ప్లాంట్లతో వెలు­వడే కాలుష్యం వాయు, జల, భూ, శబ్ద కాలు­ష్యా­లకు కార­ణ­మ­వు­తుం­దని తెలి­సినా ప్రజా­సం­క్షేమం కంటే ప్లాంట్ల నిర్మా­ణమే లక్ష్యంగా తప్పుడు నివే­ది­క­లతో అను­మ­తులు సాధి­స్తు­న్నా­రనేది పర్యా­వ­రణ వేత్తల వాదన. 2017లో సెంట్ర‌ల్ ఎల‌­క్ట్రి­సిటీ అథా­రిటీ వారు ప‌వ‌ర్ ప్లాంట్స్ నుంచి నిపు­ణు­ల‌ను, బీహె­చ్ఎ­ఈ­ఎల్ నుంచి ఒక‌­రిని, ఇతర రంగాల నిపు­ణ­లతో కమిటీ క‌మిటీ ఏర్పాటు చేశారు. కొత్త‌గా ఫ్లూ గ్యాస్‌ డీస­ల్ఫ­రై­జే­షన్‌ (ఎఫ్జీడీ) ప్లాంట్‌ పెట్టి­న‌­ప్పుడు ఎలాంటి మార్పులు పాటిం­చాలి? ఎలాంటి నియ‌­మాలు పాటిం­చా­లి? అనే అంశాలు రూపొం­దిం­చారు. కానీ యాదాద్రి ప్లాంట్‌లో అలాం­టిది పెట్ట‌­లేదు. ఇన్నే­ళ్ల­యినా కమిటీ సూచ­న­లను పట్టిం­చు­కో­లేదు. పర్యా­వ­రణ నిబం­ధ­నల్లో ఎఫ్‌­జేడీ పెట్టాలని నిర్దేశిస్తూనే.. 275 మీటర్ల గొట్టాలు నిర్మిం­చ­వ­చ్చని గంద­ర­గోళ నిబం­ధ­నలు పొందు­ప­రు­చ­డంతో వాటి మాటున కాలుష్య నివా­రణ చర్య­లను యథేచ్ఛగా ఉల్లం­ఘి­స్తు­న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 తర్వాత రామ­గుం­డెంలో 800 చొప్పున రెండు యూనిట్లు, విజ­య­వాడ, కృష్ణ­ప­ట్నంలో, ఇబ్ర­హీం­ప­ట్నంలో కట్టిన ఫ్లాంట్ల­లోనూ 275 మీటర్ల గొట్టా­లనే నిర్మిం­చడం గమ­నార్హం.


150 మీటర్ల వరకే నిర్మిం­చా­ల్సిన అవిరి గొట్టాలు.. 275 వరకు నిర్మిం­చేసి, వాతా­వ­రణ కాలుష్యం తక్కువ వచ్చిం­దని చెబుతు మోసం చేస్తు­న్నారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇప్ప­టికే నడు­స్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లు వెద­జల్లే వాతా­వ­రణ కాలు­ష్యంతో వాటి చుట్టు­ప­క్కల ఏటా 12వేల మంది ప్రజలు ఆయు ప్రమా­ణాల కంటే ముందే ప్రాణాలు కోల్పో­తు­న్నా­రని, ఈ లెక్కన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ కాలుష్యంతో ఏటా 2వేల మంది ప్రాణా­లకు ప్రమాదం ఏర్ప­డ­వ­చ్చని పర్యా­వ­రణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పంట దిగు­బడి తగ్గి­పో­వడం, జీవో­త్పత్తి సామర్థ్యాలు పడి­పో­వడం జరు­గు­తుందని ఇప్ప­టికే అనేక అధ్యయనాలు వెల్ల­డిం­చా­యని వారు ప్రస్తా­వి­స్తు­న్నారు.

Exit mobile version