Asaduddin Owaisi | విధాత: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేష్టలు అత్యున్నత స్థాయిలో ఉన్న బఫూన్ బెదిరింపుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50 శాతానికి చేరాయని అసదుద్దీన్ విమర్శించారు. రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్.. పాకిస్తాన్, చైనాలపై మాత్రం తక్కువ సుంకాలు వేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను కూడా ఆర్థికంగా గందరగోళ పరిచేదిగా ఉందంటూ అసదుద్ధీన్ విమర్శించారు.
Asaduddin Owaisi | బఫూన్ బెదిరింపులు’.. ట్రంప్పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.. "బఫూన్ బెదిరింపులు" అంటూ ఘాటు విమర్శలు! భారత్పై ఎక్కువ సుంకాలు.. చైనా, పాకిస్థాన్కు సడలింపులేమిటని ప్రశ్న!

Latest News
అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!