విధాత : మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఓ ఉపాధ్యాయుడు కారు బానెట్ పై పడిపోయిన బైక్ ను కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లిన ఘటన వైరల్ గా మారింది. గుజరాత్లోని మహిసాగర్ జిల్లా మోడాసా-లూనావాడ రోడ్డుపై మనీశ్ పటేల్ అనే ఉపాధ్యాయుడు సోదరుడు మెహుల్ పటేల్తో కలిసి మద్యం తాగి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో దినేశ్భాయ్ (50), సునీల్ (21) అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం తర్వాత కూడా కారును ఆపకుండా, దాని ముందు భాగంలో బానెట్ పై ఇరుక్కుపోయిన బైక్ను అలాగే కిలోమీటరుకుపైగా లాక్కెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు బానెట్ పై బైక్ తో పాటు గాయపడిన ఓ వ్యక్తి ఉన్నట్లుగా..అతను కొంత దూరం వెళ్లాక కిందపడిపోయినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అందులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు మనీశ్ పటేల్, మెహుల్ పటేల్ను అరెస్టు చేసి రిమాండ్ చేశారు.
In Gujarat’s Mahisagar district, a drunk car driver hit a youth’s bike and dragged him for nearly 2 km before he fell off and died. pic.twitter.com/ifDgNQj6LF
— Krishna Chaudhary (@KrishnaTOI) October 29, 2025
