Site icon vidhaatha

కోల్​కతా డాక్టర్​ కేసులో సంచలన నేపథ్యం?

ప్లాన్​ ప్రకారం అక్కడ జరగాల్సింది ఆ డాక్టర్​ హత్య మాత్రమే. కానీ, హత్యకు కారణమేంటనే అనవసరపు ఆలోచనలు  ఎవరికీ రాకుండా, రేప్​ – మర్డర్​ అనబడే నేరంగా మార్చేందుకు అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అసలు కారణం, డ్రగ్​ మాఫియా.   అధికార తృణమూల్​ కాంగ్రెస్​ అండదండలతో ఆ హాస్పిటల్​లో నడుస్తున్నమాదకద్రవ్యాల దందా. అందుకే ఓ మహిళ అయ్యుండీ, ముఖ్యమంత్రి ఈ ఘోరంపై సరైన రీతిలో స్పందించలేదు.

ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​, కోల్​కతా(RG Kar Medical College and Hospital, Kolkata) – ఓ అత్యంత కిరాతకానికి మూగసాక్షిగా మిగిలిపోయింది. అలా చాలా విషయాలకు ఆ ఆసుపత్రి మూగసాక్షే. 29 ఏళ్ల ఒక పీజీ రెండవ సంవత్సరపు జూనియర్​ వైద్యురాలు (Junior Doctor)అర్థరాత్రి జరిగిన దారుణ దమనకాండకు బలైపోయింది. కారణం, తను సాక్ష్యంగా నిలిచిన మాదకద్రవ్యాల దందా. ఆసుపత్రిలో యధేచ్ఛగా తిరుగుతున్న డ్రగ్​ మాఫియా(Drug Mafia), వైద్య విద్యార్థులకు డ్రగ్స్​ సరఫరా చేస్తూ, దాన్ని ఓ అడ్డాగా మార్చుకున్నారు. అధికారపార్టీ నేత(Trinamul Congress Leaders)ల కనుసన్నలలో నడుస్తున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, బలైన వైద్య విద్యార్థిని ఈ డ్రగ్​ దందాను (Eyewitness for Drug deal) కళ్లారా చూసినట్లు, అందుకే తనను అంతమొందించేందుకు పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు తెలిసింది. కేవలం హత్యే చేసి ఊరుకుంటే, ఒక సాధారణ జూనియర్​ డాక్టర్​ను చంపాల్సిన అవసరమేముందనే సందేహాలు మొదలై, అనవసరమైన విచారణకు దారితీసి, తుదకు తమదాకా చేరుకుంటుందనే భయంతో, అప్పటికప్పుడు పథకంలో మార్పు చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. అప్పుడు రేప్​ అనేదే ప్రధానంగా కనబడుతుంది. అందులో భాగంగానే హత్య జరిగుంటుందని అందరూ అనుకోవాలనేదే మాఫియా పథకం. నిజానికి వారి ప్లాన్​లో అత్యాచారం లేదు. ఈ విషయమంతా హాస్పిటల్​ సిబ్బందికి, విద్యార్థులకు బాగా తెలుసని తెలుస్తోంది. ఆ అమ్మాయికి ఆ రోజు నైట్​ డ్యూటీ వేయడం, రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడా ప్లేస్​ లేకుండా చేయడంవల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో తను సెమినార్​ హాల్​లోనే పడుకోవడం అంతా పథకంలో భాగమే – Planned Murder along with Rape.

జరిగిన ఘోరంలో ప్రధాన పాత్రధారి సంజయ్​ రాయ్​ (Sanjoy Roy) అనబడే ఓ పోలీస్​ వలంటీర్​. పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలు అతన్ని కోల్​కతా పోలీస్​  సంక్షేమ బోర్డులోకి తీసుకోవడానికి ఉపకరించాయి. దానిద్వారానే అతను ఈ ప్రభుత్వ వైద్య కళాశాల పోలీస్​ ఔట్​పోస్టులోకి రాగలిగాడు. కోలకతా పోలీస్​ 4వ బెటాలియన్​(Kokata Police 4th Battalion)లో విస్తృతమైన స్వేచ్ఛ కలిగిన సంజయ్​ రాయ్​ హాస్పిటల్​ అంతా విచ్చలవిడిగా తిరిగేవాడు. అతనికి ఎదురుతిరిగే దమ్మెవరికీ లేదు. ఆ కాలేజీలో డ్రగ్స్​ దందాకు అధినేత ఈ సంజయే. జరిగిన ఘోరంలో ప్రత్యక్షంగా పాల్గొంది కూడా ఇతనేనని ఆసుపత్రి సిబ్బంది, పేరు చెప్పడానికి ఇష్టపడని దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి తెలిపారు. ఈ సంజయ్​ అనేవాడికి లేని దురలవాట్లు లేవు. భార్యలను విపరీతంగా వేధించేవాడని, నిత్యం పోర్న్​ చిత్రాలను మొబైల్​లో చూసేవాడని తెలుస్తోంది. తన స్వయంగా మాదకద్రవ్యాలకు బానిస కూడా(Sanjoy roy is a drug addict). ఈ దారుణం తర్వాత సంజయ్​ రాయ్​ కోలకతా పోలీస్​ 4వ బెటాలియన్​లోని బ్యారక్​లోనే పడుకున్నాడని ఆ అధికారి తెలిపారు.

ఇందులో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ సందీప్​ ఘోష్​ (Dr. Sandeep Ghosh) ప్రమేయం కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదట్లో తను అమ్మాయిదే తప్పు అని వాదిస్తూ, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. ఈ సందీప్​ అనే డాక్టర్​ చరిత్ర కూడా అంతా అవినీతి, నేరమయమే. డాక్టరే అయిన తన భార్య రెండు వారాల బాలింతగా ఉన్నప్పుడు, కడుపులో తంతే, ఆమె ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. ఇరుగుపొరుగు వారు హాస్పిటల్​కు తీసుకెళ్లి ఆమెను కాపాడారు. అధికార తృణమూల్​తో గట్టి సంబంధాలున్న సందీప్​, గతంలో జరిగిన తన రెండు బదిలీలను సమర్థవంతంగా అడ్డుకుని 48 గంటలలోపే తిరిగి అక్కడే జాయినయ్యాడు. ఇప్పుడు కూడా ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్ ప్రిన్సిపాల్​గా తప్పించి హైకోర్టు, లీవ్​లో వెళ్లాల్సిందిగా ఆదేశించినా, వెంటనే మరో కాలేజీకి ప్రిన్సిపాల్​గా నియమితుడయ్యడంటేనే తన పలుకుబడి(highly influential in Trinamul Cogress) ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంజయ్​ రాయ్​, సందీప్​ ఘోష్​.. ఇద్దరూ తోడుదొంగలే. తిరిగి వేరే కళాశాలకు నియమితుడయ్యడన్న విషయం తెలుసుకున్న కోల్​కతా హైకోర్టు(Kolkata High Court),  ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తిరిగి ఇంట్లో కూర్చోబెట్టింది. కేసును సిబిఐకి బదిలీ (Transferred to CBI)చేసింది.

ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఇండియన్​ మెడకల్​ అసోసియేషన్​ (IMA)వైద్యసేవల నిలుపుదలకు పిలుపునిచ్చింది. ప్రతీ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు, ఆందోళనలతో ఆసుపత్రులను వణికిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ అయినా ఈ ఘోరం వెనుక ఉన్న నిజాలను బయటికితీసి అసలు దోషులను, డ్రగ్​ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Exit mobile version