విధాత : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ దఫా కేంద్రం ఐదుగురు ప్రముఖులకు భారత రత్న ప్రధానం చేసింది. వారిలో ఎల్కే అద్వానీతో పాటు మరణాంతరం భారత రత్నకు ఎంపికన భారత మాజీ ప్రధాని పీ.వి.నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లు ఉన్నారు.
ఎల్కే అద్వానీకి భారత రత్న అందించిన రాష్ట్రపతి, ప్రధాని
విధాత : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి […]

Latest News
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !