ఘనంగా భారత రత్న ప్రధానోత్సవం

దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న ప్రదానోత్సవం శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఘనంగా నిర్వహించారు

  • Publish Date - March 30, 2024 / 04:23 AM IST

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న ప్రదానోత్సవం శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఘనంగా నిర్వహించారు

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రధానం

పీవీ తరుపున అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు

విధాత : దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న ప్రదానోత్సవం శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న పురస్కారాలను అందించారు. పలు రంగాల్లో దేశానికి విశేష సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్, బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాధన్‌లకు ఈ అత్యున్నత పురస్కారాలతో గౌరవించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇందులో నలుగురికి మరణానంతరం భారత రత్న అవార్డు లభించగా.. నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్ సింగ్ తరపున ఆయన మనవుడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అద్వాని ఇంటికెళ్లి ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నారు. భారత రత్న ప్రధానోత్సవం కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు.

Latest News