అహ్మదాబాద్: 193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్ఫ్లైట్ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించి, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. ఆకాశ ఎయిర్ఫ్లైట్ క్యూపీ 1719 విమానం ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరింది. ఇందులో ఒక చంటిపాప సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గగనతలంలో ఉండగా.. ఎయిర్లైన్ వర్గాలకు అందులో బాంబు పెట్టినట్టు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించి సోమవారం ఉదయం 10.13 గంటలకు సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు చెన్నై నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో తనిఖీల అనంతరం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
విమానాలకు వరుస బెదిరింపులు.. తాజాగా ఆకాశ ఎయిర్ఫ్లైట్కు
193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్ఫ్లైట్ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు