అహ్మదాబాద్: 193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్ఫ్లైట్ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించి, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. ఆకాశ ఎయిర్ఫ్లైట్ క్యూపీ 1719 విమానం ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరింది. ఇందులో ఒక చంటిపాప సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గగనతలంలో ఉండగా.. ఎయిర్లైన్ వర్గాలకు అందులో బాంబు పెట్టినట్టు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించి సోమవారం ఉదయం 10.13 గంటలకు సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు చెన్నై నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో తనిఖీల అనంతరం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
విమానాలకు వరుస బెదిరింపులు.. తాజాగా ఆకాశ ఎయిర్ఫ్లైట్కు
193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్ఫ్లైట్ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు

Latest News
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?