కాళేశ్వరం(Kaleshwaram) అవినీతిని డైవర్ట్ చేయడానికే తెరపైకి కవిత అంశాన్ని తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.బుధవారం ఆయన కరీంనగర్(Karimnagar) లో మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ కు కవిత రాజీనామా చేస్తే ఏమి అవుతోందని . . కవితను సస్పెండ్ చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అని ఆయన ప్రశ్నించారు. కవిత(Kavitha) ఎపిసోడ్ తో తెలంగాణకు ఏమైనా లాభం ఉందా అని ఆయన అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ పై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్(BRS) నాయకత్వం సెప్టెంబర్ 2న కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. కనీసం వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని ఆమె విమర్శించారు. సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత(Kavitha) రాజీనామా చేశారు. మరోసారి కవిత హరీశ్ రావు, సంతోష్ పై ఆరోపణలు చేశారు. తనను పార్టీనుంచి బయటకు పంపేందుకు అనేక కుట్రల చేశారని ఆమె అన్నారు. తన లేఖ మీడియాకు ఎలా లీకైందని ఆమె ప్రశ్నించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు, కవితకు మధ్య గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. అది చివరకు ఆమె పార్టీకి దూరం కావడానికి కారణమైంది.
Bandi Sanjay : కాళేశ్వరం అవినీతి డైవర్ట్ చేయడానికే తెరపైకి కవిత అంశం
కాళేశ్వరం అవినీతిని డైవర్ట్ చేయడానికే కవిత అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ అన్నారు. కవిత ఎపిసోడ్ ప్రజల దృష్టి మళ్ళించడానికేనని ఆయన వ్యాఖ్యానించారు.

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్