విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేసిన ఒత్తిడి..కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చింది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం స్పందన నేపథ్యంలో ఇటు వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రం తెలంగాణకు 8 లక్షల టన్నుల యూరియా ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. కాంగ్రెస్ ఎంపీల పోరాటం!
తెలంగాణ యూరియా కొరత సమస్యపై కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించి కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయించడానికి హామీ ఇచ్చింది.

Latest News
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం
ముగ్గు పోయని వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం! దుబాయ్లో.. బంగారంపై భారీ డిస్కౌంట్లు!
ఉగాది తర్వాత.. ఈ రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది..!
అట్టహాసంగా జరిగిన అల్లు శిరీష్-నయనిక వివాహం ..
శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి సొంతింటి కల నెరవేరుతుంది..!