విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేసిన ఒత్తిడి..కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చింది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం స్పందన నేపథ్యంలో ఇటు వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రం తెలంగాణకు 8 లక్షల టన్నుల యూరియా ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. కాంగ్రెస్ ఎంపీల పోరాటం!
తెలంగాణ యూరియా కొరత సమస్యపై కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించి కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయించడానికి హామీ ఇచ్చింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు