టి20 ప్రపంచకప్ టోర్నీ(T20 Cricket World Cup 2024)లో ఇండియా(India) సెమీ ఫైనల్ దరికి చేరింది. సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్(Bangladesh)పై 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ను ఎంచుకోవడంతో భారత్ ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. రోహిత్(23), కోహ్లీ(37) ఇద్దరూ బ్యాట్లు విదిలించడంతో, స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే ఈ వేగం ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద తొలివికెట్ రూపంలో రోహిత్ వెనుదిరగగా, విరాట్కు జత కలిసిన పంత్ కూడా వేగంగా ఆడటంతో పరుగుల వేగం ఆగలేదు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వెంటవెంటనే అవుటవడంతో, అప్పటికే క్రీజ్లో ఉన్న శివమ్ దూబే(34)కు జత కలిసిన హార్థిక్ పాండ్యా(27 బంతుల్లో 50 పరుగులు– 4 ఫోర్లు, 3 సిక్సర్లు) Hardhik Pandya fast fifty మెరుపువేగంతో పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు విలువైన 53 పరుగులు జోడించారు. ఇక మరో వికెట్ పడకుండా పాండ్యా ఇన్నింగ్స్ను ముగించాడు. పవర్ప్లేలో 50 పరుగులు సాధించిన ఇండియా, 11.2 ఓవర్లలో 100, 16.4 ఓవర్లలో 150 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. India 196/5
బంగ్లా బౌలర్లలో టాంజిమ్, రిషద్ చెరో రెండు వికెట్లు తీయగా, షకీబ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఏ దశలోనూ గమ్యంవైపు ప్రయాణించలేకపోయింది. అర్షదీప్, బుమ్రాల పేస్ను ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడ్డ బంగ్లా బ్యాటర్లు, అసహనంతో వికెట్లు పారేసుకున్నారు. ప్రమాదకరమైన లిటన్దాస్ను పాండ్యా పెవిలియన్కు పంపగా, కుల్దీప్(Kuldeep Yadav) బంతులను గిరగిరా తిప్పడంతో ఎటూ అర్థంకానీ బ్యాటర్లు ముగ్గురు అతనికే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్కు చేరుకున్నారు. ఒక్క శాంట్ మాత్రమే ఒంటరి పోరాటం చేసి 40 పరుగులు సాధించగలిగాడు. 20 పరుగుల స్కోరు దాటింది శాంటోతో కలిపి ముగ్గురే. అప్పటికే రన్రేట్ చేతులు దాటడంతో బంగ్లా చేతులెత్తేసింది. 15.3 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీన్ని బట్టి పరుగులు రావడం ఎంత కష్టంగా మారిందో అర్థం అవుతుంది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి, ఓటమి పాలైంది. Bangladesh 146/8.
భారత బౌలర్లలో కులదీప్ 3 వికెట్లతో చెలరేగగా, బుమ్రా పదునైన బౌలింగ్తో 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు, అర్షదీప్ మరో 2, పాండ్యా ఒక వికెట్ తీసారు.