Site icon vidhaatha

T20 World Cup 2024 | అఫ్ఘనిస్తాన్​పై భారత్​ ఘనవిజయం

టి20 ప్రపంచకప్​(T20 World Cup 2024) పోటీల్లో భాగంగా బార్బడోస్​లో జరిగిన సూపర్​ 8 మ్యాచ్​లో భారత్​ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది(India beat Afghanistan). టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఓపెనర్లు రోహిత్​(8), కోహ్లీ(24) పరుగులు చేసి అవుటవ్వగా, పంత్​(20), దూబే(10) మాత్రమే చేయగలిగారు. ఇన్నింగ్స్​ను నిర్మించిందంటే సూర్యకుమార్​ యాదవ్(Surya Kumar Yadav)​. ఓ పక్క వికెట్లు పడుతున్నా, తొణక్కుండా అఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పైచేయి సాధించాడు. సూర్యకు తోడుగా పాండ్యా(Hardhik Pandya) కూడా బ్యాట్​ ఝుళిపించడంతో, చివరికి నిర్ణీత 20 ఓవర్లతో భారత్​ 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది(India 181/8).

అఫ్ఘన్​ బౌలర్లలో కెప్టెన్​ రషీద్​ ఖాన్​, ఫజల్​హక్​ ఫరూఖీ చెరో మూడు కీలక వికెట్లు తీసి భారత్​ను కట్టడి చేసారు. నవీన్​ఉల్​హక్​ ఒక వికెట్​ తీసాడు.

182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా, అక్షర్​ దెబ్బకు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 71 పరుగులకు 5 వికెట్లు సమర్పించుకున్న అఫ్ఘన్​ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్​ అయింది(134 All out).

భారత బౌలర్లలో బుమ్రా, అర్షదీప్​ చెరో 3 వికెట్లతో రాణించగా, కుల్​దీప్​ 2, అక్షర్​, పాండ్యా తలా ఓ వికెట్ కూల్చారు. ముఖ్యంగా బుమ్రా (4–1–7–3) నిప్పుల్లాంటి బంతులేసి అఫ్ఘన్​కు వణికించాడు.

దీంతో భారత్​ 2 పాయింట్లు సాధించి, 2.35 నెట్​ రన్​ రేట్​ తో టేబుల్​ టాపర్​గా నిలిచింది.

 

Exit mobile version