బీజేపీ హైద‌రాబాద్ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వి లతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధ‌విల‌త‌ మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు

  • Publish Date - April 22, 2024 / 05:15 PM IST

విధాత‌: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధ‌విల‌త‌ మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. శోభ‌యాత్ర‌లో భాగంగా మాధవిల‌త సిద్దంబ‌ర్ బ‌జార్ చౌరస్తా వద్ద ఉన్న మజీద్ పై బాణం ఎక్కుపెట్టినట్లు యాక్ష‌న్ చేశారు. ఆ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న ఫిర్యాదు మేర‌కు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఐపీసి 295 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Latest News