విధాత, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో టోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీతక్క తరఫు న్యాయవాది వెంకటనాయక్ ఫిర్యాదుపై ఐటీఏ-2000-200,79,33 , (4),353(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నప్పుడు, అలాగే పొన్నం ప్రభాకర్తో పాటు మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి ట్రోలింగ్స్ చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘాటు స్పందించారు. శాసన సభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లు సందర్భంగాను ఈ సమస్యపై అధికార, విపక్ష సభ్యుల మధ్య రచ్చ సాగింది. చట్ట సభల్లో వీడియోలు, ఫోటోలు తీయరాదన్న పార్లమెంటు నిబంధనలను సైతం మంత్రి ఉత్తమ్ చదివి వినిపించారు. సభలో వీడియోలకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. అనంతరం పోలీసులు ఈ వివాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
TELANGANA | మంత్రుల మార్ఫింగ్ వీడియోలపై కేసు నమోదు
రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో టోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest News
పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజనీరింగ్ లో పాలు- భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వివరించిన సెంటర్ ఫర్ లిబర్టీ
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై లవ్ సాంగ్
ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!
కేటీఆర్ మూటల మాటలకు బల్మూరి, చామల కౌంటర్
‘ఉస్తాద్ భగత్సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ..
దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !
‘రణబాలి’ స్టోరీ ఇదేనా..
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు
కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్