విధాత, హైదరాబాద్ : కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్పై వారితో రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలని సూచించారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండని తెలిపారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలని, ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి కౌంటింగ్ అంశాలపై అవగాహనతో ఉండాలని సూచించారు.
కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి ఎంపీ అభ్యర్థులు, ఇంచార్జిలకు.. సీఎం రేవంత్రెడ్డి సూచన
కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్పై వారితో రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి