విధాత, హైదరాబాద్ : కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్పై వారితో రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలని సూచించారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండని తెలిపారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలని, ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి కౌంటింగ్ అంశాలపై అవగాహనతో ఉండాలని సూచించారు.
కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి ఎంపీ అభ్యర్థులు, ఇంచార్జిలకు.. సీఎం రేవంత్రెడ్డి సూచన
కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్పై వారితో రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు.

Latest News
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్