విధాత, వరంగల్ ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ కౌంటర్లు ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హరిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడానికి ఆపరేషన్ కగారు ద్వారా నక్సలైట్ల అనే పేరుతో ఎన్ కౌంటర్ చేస్తూ నరమేధం సృష్టించడం సరైనది కాదన్నారు. జనగామ, హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి తప్ప చంపడం సరైనది కాదన్నారు. బలం ఉందనే పేరుతో ఏది చేసినా నడుస్తుందని విర్రవీగిన నియంతలందరూ మట్టి కలిసిపోయారని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని వెస్లీ హెచ్చరించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు అలాంటి అవకాశాన్ని సిపిఎం పార్టీకి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలోఅబ్బాస్, యాదగిరి, శేఖర్, ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
John Wesley : ఎన్ కౌంటర్లు నిలిపివేసి, చర్చలు జరపాలి
ఎన్ కౌంటర్లు నిలిపి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఎం నేత జాన్ వెస్లీ కేంద్రంపై విమర్శలు చేశారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర ఉందన్నారు.

Latest News
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !
క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు
అల్లు-మెగా వార్ నడుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్..
స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద హుష్ !
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్ఫామ్పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు
భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం : ఈటెల రాజేందర్