విధాత : దళిత బంధు పథకం యూనిట్లు దారి మళ్లితే చర్యలు తీసుకుని తిరిగి లబ్ధిదారులకు చేర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. చింతకాని మండలంలో అర్హులందరికీ దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. ఈ పథకంలో అమలులో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారులకు వారంలోగా రెండవ దశ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచురేషన్ పద్ధతిలో ఎంపికైందని అన్ని గ్రామాలను ప్రత్యేక అధికారులు సందర్శించి లబ్ధి పొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేక దారి మళ్లాయా అన్నదానిపై విచారణ జరిపించాలన్నారు. ఇతరులకు అమ్మరా బదిలీ చేశారా గుర్తించి వాటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు ప్రత్యేక అధికారులు అందించాలని తెలిపారు. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని స్పష్టం చేశారు. వందశాతం దళిత బంధు లబ్ధిదారులు యూనిట్ల ద్వారా వ్యాపారం చేయాల్సిందేనని, వారి వద్దనే వ్యాపారానికి కేటాయించిన యూనిట్లు ఉండాలని స్పష్టం చేశారు.
దళిత బంధు పథకం యూనిట్ల దారి మళ్లింపుపై చర్యలు : డిప్యూటీ సీఎం భట్టి
దళిత బంధు పథకం యూనిట్లు దారి మళ్లితే చర్యలు తీసుకుని తిరిగి లబ్ధిదారులకు చేర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు