కుమురం భీం జిల్లాలో ఏనుగు దాడి రైతు మృతి

  • Publish Date - April 3, 2024 / 11:29 PM IST

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు అడవి ప్రాంతం నుండి మిర్చి తోటలోకి వచ్చి బీభత్సం సృష్టించడంతోపాటు అక్కడే ఉన్న రైతుపై దాడి చేసింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో రైతు తన మిరప తోట దగ్గర పని చేస్తుండగా బూరేపల్లి అడవి ప్రాంతం నుండి వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన వచ్చిన ఏనుగు మిర్చి పంటను ధ్వంసం చేసింది. భురేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్(50) అనే వ్యక్తి తోటలో పనిచేస్తుండగా మిర్చి పంటను ధ్వంసం చేస్తూ అక్కడే ఉన్న రైతుపై దాడి చేయడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు ఏనుగు జనావసాల్లోకి వచ్చి దాడి చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు నుంచి భురేపల్లి గ్రామానికి వచ్చిందని ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులకుతెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Latest News