విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎనిమిది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. చర్చలకు సమయం చాలదన్న భావనతో తాజాగా ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించారు. సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 26 వ తేదీన సెలవు ఉండటంతో 27న బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. తర్వాత 28 తేదీ మరో సెలవు ఉండగా.. 29వ తేదీన 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆరోజే ఉండనుంది. ఇక 30 న మరో 19 పద్దులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. అలాగే 31 తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం జరగునున్నాయి. పొడిగించిన ఆగస్ట్ 1,2 తేదీలలో ప్రభుత్వ అజెండా, బిల్లులపై చర్చ చేపట్టనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు బుధవారం రెండో రోజు అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో మునుముందు సమావేశాలు కూడా ఇదే రీతిన సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
Telangana Legislative Assembly | ఆగస్టు 2వరకు అసెంబ్లీ సమావేశాల పొడిగింపు … ప్రభుత్వం కీలక నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎనిమిది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

Latest News
Green SM | ఉబెర్, ఓలాకు గట్టి పోటీ.. భారత్లో కొత్త క్యాబ్ సర్వీస్లు ప్రారంభం
ఫామ్హౌస్ కేడీతోనైనా..ఢిల్లీ మోదీతోనైనా కొట్లాడతా : సీఎం రేవంత్ రెడ్డి
ChatGPT | పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థికి.. ఊహించని షాకిచ్చిన చాట్జీపీటీ
Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య
Oneplus Turbo 6X | రూ.22వేలలోనే వన్ప్లస్ టర్బో మొబైల్.. కొత్త సిరీస్ వివరాలివే..!
పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు
తమిళనాడు పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేసిన ట్రాలీ సూట్కేస్.. తెరిచి చూస్తే…
సెభాష్ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?
హైదరాబాద్ ప్రజలకు మరో రిలీఫ్.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్
గ్రౌండ్ యాక్షన్లోకి ‘బొద్దింకలు’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోరుతూ ఢిల్లీలో నిరసన