విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎనిమిది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. చర్చలకు సమయం చాలదన్న భావనతో తాజాగా ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించారు. సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 26 వ తేదీన సెలవు ఉండటంతో 27న బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. తర్వాత 28 తేదీ మరో సెలవు ఉండగా.. 29వ తేదీన 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆరోజే ఉండనుంది. ఇక 30 న మరో 19 పద్దులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. అలాగే 31 తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం జరగునున్నాయి. పొడిగించిన ఆగస్ట్ 1,2 తేదీలలో ప్రభుత్వ అజెండా, బిల్లులపై చర్చ చేపట్టనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు బుధవారం రెండో రోజు అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో మునుముందు సమావేశాలు కూడా ఇదే రీతిన సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
Telangana Legislative Assembly | ఆగస్టు 2వరకు అసెంబ్లీ సమావేశాల పొడిగింపు … ప్రభుత్వం కీలక నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎనిమిది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

Latest News
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ
ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్