విధాత, హైదరాబాద్ : గ్రూప్-4 ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ల కోసం నమోదు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. అలా చేసిన వారికే విడతల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు వెరిఫికేషన్ హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్ సైట్లో పొందుపరుచనున్నట్లుగా పేర్కోంది. రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. పరీక్ష జూలై 2023లో జరిగింది. 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్ష నిర్వహించారు. టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 9న సాధారణ ర్యాంక్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికల కోడ్ రాక కారణంగా మెరిట్ జాబితా ఆలస్యమైంది. ఇప్పుడు మెరిట్ జాబితాను విడుదల చేసి, వెబ్ ఎంపికల తేదీలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమైన సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. ధృవీకరణ పత్రాల సమయంలో సూచించి పత్రాలన్నీ తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఎలాంటి అదనపు గడువు ఇవ్వబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.
గ్రూప్ -4 మెరిట్ జాబితా వెల్లడి … 13నుంచి వెబ్ ఆప్షన్లు
గ్రూప్-4 ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత