Warangal | అక్రమాలు బయటపడకుండా బీఆర్ఎస్ జిమ్మిక్కులు : కడియం శ్రీహరి

వాళ్ళ మీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

వాళ్ళ మీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి నిజాయితీ ఉంటే కల్వకుంట్ల కవిత ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా మీడియాతో కడియం మాట్లాడుతూ, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్ లు ఉన్నాయని కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1100 కోట్ల నుండి 1700 కోట్లకు పెంచారాని కవిత చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మండిపడ్డారు.

బిసి రిజర్వేషన్లు పెంచడానికి బీజేపీ వ్యతిరేకం

బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదని కడియం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బిసి రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బీసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News